Jayajayahe Telangana with Telugu lyrics for School Prayer

Monday, September 12, 2022

దేశాన్ని సుభిక్షంగా మార్చే సత్తా కేసీఆర్‌కే ఉన్న

 

దేశాన్ని సుభిక్షంగా మార్చే సత్తా కేసీఆర్‌కే ఉన్నది

 

దేశాన్ని సుభిక్షంగా మార్చే సత్తా కేసీఆర్‌కే ఉన్నది

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (నమస్తే తెలంగాణ):రాష్ర్టాన్ని కరువు, కాటకాల నుంచి దూరం చేసి సస్యశ్యామలం చేసినట్టే.. దేశాన్ని కూడా సుభిక్షంగా మార్చగల సామర్థ్యం సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉన్నది. రాష్ట్రంలో రైతులకు సాగు నీరు, తాగు నీరు అందించినట్టే దేశంలోనూ ప్రతి ఒక్కరికీ మౌలిక వసతులు కల్పించే సత్తా ఆయనకు ఉన్నది. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా భావించిన మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చెరువులు, కుంటలకు పూర్వ వైభవం వచ్చింది. వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు, పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా వంటి సంక్షేమ పథకాలు నేడు దేశానికి అత్యవసరం. సీఎం కేసీఆర్‌ దేశ్‌ కీ నేత అయితే ప్రపంచంలో భారత్‌ ముందు వరుసలో ఉండటం ఖాయం. అన్ని రాష్ర్టాల ప్రజలు సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలి అని ఎదురు చూస్తున్నారు.
ప్రసాద్‌, ఉపాధ్యాయుడు, బొంతపల్లి జడ్పీ స్కూల్‌, గుమ్మడిదల, సంగారెడ్డి

No comments:

Post a Comment