గాంధీజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించుకుందాం.. ఉందిలే మంచికాలం..కాలమ్ము మారిందోయ్.గాంధీపుట్టిన దేశం

Wednesday, November 30, 2022

vijetha-tho-vision-live-kcr-live-interview.-kcr-08-mar-2014-7-pm

 

Vijetha tho Vision Live KCR live Interview KCR 08 mar 2014 7 pm TNEWS

https://telangana-gundechappudu.blogspot.com/2022/11/vijetha-tho-vision-live-kcr-live.html https://telangana-gundechappudu.blogspot.com/2022/11/13.html CM KCR | Diksha Diwas Special Debate With Venkat | Telangana Movement | T News https://telangana-gundechappudu.blogspot.com/2022/11/live-cm-kcr-diksha-diwas-special-debate.html

ఒకే ఒక్కడు -నేడు దీక్షా దివస్ మలిదశ ఉద్యమాన్ని కీలకమలుపుతిప్పిన కేసీఆర్దీక్షకు నేటితో 13ఏండ్లు.

https://telangana-gundechappudu.blogspot.com/2022/11/13.html https://telangana-gundechappudu.blogspot.com/2022/11/vijetha-tho-vision-live-kcr-live.html CM KCR | Diksha Diwas Special Debate With Venkat | Telangana Movement | T News https://telangana-gundechappudu.blogspot.com/2022/11/live-cm-kcr-diksha-diwas-special-debate.html

నేడు దీక్షా దివస్ 29 NOV. 2022

https://youtube.com/shorts/-MZFfwh4l6M

NEWS VIDEO CLIP NAMASTHE TELANGANA 29 NOV 2022

మూడు ప్రాజెక్టులకు లైన్ క్లియర్

అరవై యేండ్ల గోసకు నవంబర్ 29 సాక్ష్యం || చిటుకుల మైసా రెడ్డి Journalist 94905 24724


అరవై యేండ్ల గోసకు నవంబర్ 29 సాక్ష్యం

గులాబీ జెండా ఎగురవేసి తెలంగాణ స్వరాష్ట్రం కోసం పల్లెల్లో, పట్టణాల్లో, తండాల్లో తెలంగాణ వ్యాప్తంగా గులాబీ ప్రభంజనం సృష్టించిన మన ముఖ్యమంత్రి కేసీఆర్.. రేపు యావత్ భారతదేశంలో రైతురాజ్యాన్ని స్థాపించేందుకు ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు తెలంగాణ సాధించేందుకు సిద్దిపేట సద్దికట్టి సాగనంపినట్లే ఇప్పుడు మన భూమి పుత్రునికి తెలంగాణ సద్ది కట్టి సాగనంపాలె. అన్నమో రామచంద్రా అని ప్రజలు బుక్కెడు బువ్వకోసం అంగలారుస్తున్న కాలమది. వర్షాల మీద ఆధారపడ్డ తెలంగాణ రైతాంగం కరువుతో కాలం వెళ్లదీస్తున్నసమయం. ఉమ్మడి పాలనలో ప్రాజెక్టులన్నీ ఆంధ్రాలో కట్టుకొని తెలంగాణను ఎండబెట్టిన ఆంధ్ర పాలకుల దోపిడీకి నిదర్శనం. నిత్యం కరెంట్ కోతలు, కరెంట్ షాక్ లు, పిడుగులు, పాముకాట్లతో తెలంగాణ అల్లాడుతున్న రోజులవి. తెలంగాణ వస్తేనే మన బీడు భూముల దూపతీరుతుందన్నఆశ. మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు మనకే దక్కుతాయన్న విశ్వాసం.ఆంధ్ర దోపిడీని చూస్తూ ఊర్కొంటే తెలంగాణ ప్రాంత బిడ్డల బతుకుల్లో ఆర్తనాధాలు తప్ప మరింకేం మిగలవనే భాధ. అప్పటికే రెండుసార్లు ఆంధ్రాపాలకులు ఉద్యమ కొలిమిని ఆర్పేశారు.ఆంధ్రా పాలకుల దోపిడీని అడ్డుకోవాలంటే మళ్లీ ఉద్యమానికి ఊపిరిపోయడం తప్ప మరో మార్గం లేదు. ఆరిన కొలిమిని మళ్లీ రాజేయలన్న కసి ప్రజల్లో నెలకొన్నది. చూస్తూ కూర్చొవడం కాదు, కొట్లాడటమొక్కటే మన ముందున్నతొవ్వ అని ప్రజలు పిడికిళ్లు బిగిస్తున్న సమయంలో కేసీఆర్ రూపంలో వారికి భరోసా దొరికినట్లయింది.ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా తన పదవులకు రాజీనామా చేశారు కేసీఆర్. పదవులు, ప్రాణం కన్న ప్రజల ఆత్మగౌరవమే ముఖ్యమని నమ్మారు. తన పదవులకు రాజీనామా చేసిన తర్వాత కేసీఆర్ అనేక చర్చలు, ఆలోచనలు,సమాలోచనలు, కసరత్తులు చేశారు. జెండా ఎత్తితే మడమ తిప్పని నైజం ఆయన సొంతం. స్వరాష్ట్ర జెండా ఎగిరేదాక వెన్నుచూపకూడదన్నది కేసీఆర్ లక్ష్యం. సిద్దిపేట ఉప ఎన్నిక ఉద్యమానికి వేదికైంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిలూదింది సిద్దిపేట. చారిత్రాత్మక ఉద్యమానికి, నాటిఉద్యమస్ఫూర్తికి అండగా నిలిచింది. ఉద్యమ పరిమళాలను నలుదిశలా వెదజల్లుతూ సిద్దిపేట ఉప ఎన్నిక నాంది పలికింది. ఆ ఎన్నికల్లో కేసీఆర్ అపూర్వ విజయం సాధించారు.తెలంగాణ లక్ష్య సాధన కోసమే ఆ రోజు కేసీఆర్ సిద్దిపేట ప్రజలు కట్టిన సద్దిమూటతో బయల్దేరాడు. తెలంగాణను సాధించిపెడుతానన్న ఒకే ఒక నినాదంతో గులాబీ ఉద్యమపతాకాన్ని చేతపట్టారు. పద్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాటంలో ఆమరణదీక్ష ఉద్యమాన్ని మలుపు తిప్పింది. నవంబర్ 29.. ‘కేసీఆర్ చచ్చుడో-తెలంగాణ వచ్చుడో' అన్న ఒకే ఒక నినాదంతో కేసీఆర్ సిద్దిపేటలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టేందుకు కరీంనగర్ నుంచి బయల్దేరారు. కానీ ఆయన కరీంనగర్ జిల్లా కేంద్రం దాటకుండానే 'అల్గునూర్ వద్ద అరెస్ట్ చేశారు. అక్కడినుంచి వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకు తరలించారు. సిద్దిపేట దీక్షాస్థలికి వెళ్లనీయకుండా అడ్డుకోగలరు కానీ తన ఉద్యమ సంకల్పాన్ని అడ్డుకోలేరనితేల్చిచెప్పి కేసీఆర్ ఖమ్మం సబ్ జైల్లోనే ఆమరణదీక్షకు దిగారు. అంతే.. తెలంగాణ అంతటా అగ్నిగుండమై ఉద్యమ సెగలు ప్రజ్వలిల్లాయి. ఆందోళనలతో అట్టుడికింది. అదే సమయంలో శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చింది.అన్నివర్గాల ప్రజలు ఉద్యమంలోకి దిగారు. దీక్ష వల్ల ఆరోగ్యం క్షీణించడంతో కేసీఆర్ను సబ్జైల్ నుంచి ఖమ్మం దవాఖానకు.. అక్కడినుంచి హైదరాబాద్ నిమ్క తరలించారు. నిమ్స్ఆరోగ్యం విషమిస్తున్నా... తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతానని కేసీఆర్ శపథం చేశారు. ప్రాణత్యాగానికి సైతం వెనుకాడననే ఆయన ధైర్యానికి దేశం యావత్తు నివ్వెరపోయింది. దీక్ష ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితిని కేసీఆర్ సృష్టించారు. డిసెంబర్ 9న యూపీఏ ప్రభుత్వంతో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయించారు. తదుపరి అనేక అడ్డంకులను అధిగమించి.. రాష్ట్రాన్ని సాధించారు. కేసీఆర్ దీక్షకు దిగిననవంబర్ 29 తెలంగాణ చరిత్రలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు పునాదిలా నిలిచింది. ఆ సందర్భాన్ని ఏటా 'దీక్షా దివస్ గా రాష్ట్ర ప్రజలు జరుపుకొంటున్నారు. ఆరు దశాబ్దాల ఉమ్మడిరాష్ట్ర పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించింది. తెలంగాణ పౌరుల పోరాటం, బలిదానాలు, త్యాగాలు, సకలజనుల సమ్మెలు, మిలియన్ మార్చ్ వంటి ఎన్నో ఉద్యమ ఎత్తుగడలతో శాంతియుత ఉద్యమాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్ ఒక్కరే.రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అభివృద్ధిని కూడా ఉద్యమ పంథాలోనే సాగించారు. రాష్ట్రం సాధించిన తక్కువ సమయంలోనే అభివృద్ధిని పరుగులు పెట్టించారు. తన వ్యూహాలతో ఒకవైపు పార్టీని, మరోవైపు రాష్ట్రాన్ని పటిష్టం చేస్తూవచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అనే ఒరవడినిసృష్టించారు. కోటి ఎకరాల మాగాణి సాగు లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. దేశంలోనే తొలిసారి రైతులకు పెట్టుబడి సాయం అందించి రైతుబంధు పెట్టినా, 24గంటలు సాగుకు ఉచిత విద్యుత్ ఇచ్చినా అది కేసీఆర్కే సాధ్యమైంది. వ్యవసాయానికే కాదు కల్యాణలక్ష్మీ,ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, రైతు బీమా,చేనేత బీమా, దళిత బంధు ఇట్ల కేసీఆర్ మేధోమథనం నుంచి పుట్టుకొచ్చిన చారిత్రక ప్రగతి పథకాలెన్నో.నడుస్తున్నది కేసీఆర్ శకం. భావితరాలకు బంగారు తెలంగాణ నిర్మాతగా, అభివృద్ధికి దిక్సూచిగా కేసీఆర్ నిలిశారు. ఎన్నో పోరాటాల అడ్డాగా తెలంగాణ గడ్డ తన వారసత్వాన్ని కొనసాగిస్తున్నది. రేపు దేశ, ప్రపంచ స్థితిగతులు, నడవడిక మార్పు దిశగా నడిపించే శక్తి కేసీఆర్.

Tuesday, November 29, 2022

LIVE : CM KCR | Diksha Diwas Special Debate With Venkat | Telangana Movement | T News

నేడు దీక్షా దివస్ 29 NOV. 2022

https://youtube.com/shorts/-MZFfwh4l6M?feature=share https://archive.org/details/my-video-51

ఒకే ఒక్కడు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు కదిలిన దీక్షాదక్షుడు నేడు దీక్షా దివస్ తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన కేసీఆర్ దీక్షకు నేటితో 13 ఏండ్లు.

ఒకే ఒక్కడు
ప్రజాస్వామ్య పరిరక్షణకు కదిలిన దీక్షా దక్షుడు
జాతీయ రాజకీయాలకు మార్గదర్శకుడు.. ప్రాంతీయ అస్తిత్వానికి వెలుగు దివిటీ
బీజేపీ అహాన్ని దెబ్బతీసిన ఏకైక నాయకుడు • మోదీ, షా అజేయులేం కాదని రుజువు చేసిన నేత
రాష్ట్ర దర్యాప్తు సంస్థల ఉచ్చులో బీజేపీ బ్రోకర్లు • ఆత్మరక్షణలో ఏమీ పాలుపోని బీజేపీ ఆగ్రనాయకత్వం
రాజనీతిని, రాజకీయ పంథాను రుచి చూపించిన నేత సీఎం కేసీఆర్ రాజనీతికి ప్రాంతీయ పార్టీలు విస్మయం

హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎనిమిదేండ్లుగా అప్రతిహిత అరాచకత్వంతో రెచ్చిపోతున్న బీజేపీని ఈ దేశంలో ధిక్కరించిన మొనగాడుగా తెలంగాణ ఉద్యమ సారథి.. పుత్తడి తెలంగాణ సాధకుడు. ముఖ్య
మంత్రి కే చంద్రశేఖర్రావు పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగుతున్నది. మోదీ, షాలు అజేయులేం కాదని, బీజేపీ దొంగ పనులను ససాక్ష్యంగా బయటపెట్టి.. ఆ పార్టీని, దాని నేతల నిస్సిగు నైజాన్ని ఎండగట్టిన ఒకే ఒక్క రాజకీయ నేత దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే..
కేసీఆర్వైపే అన్ని రాజకీయ పార్టీలు చూస్తు
న్నాయి. కేసీఆర్ అనైతిక రాజకీయాలు, కూట
నీతి కుట్రలను పటాపంచలు చేసి.. దేశవ్యా
ప్తంగా నీరసించి పోయిన రాజకీయ వర్గాల్లో
మళ్లీ ఒక భరోసాను నింపిన నాయకుడిగా

కేసీఆర్ను ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయ పండితులు కొనియాడుతున్నారు. గత కొన్నేండ్లుగా
మోదీ, షాల దెబ్బకు ప్రాంతీయ పార్టీలు కుదేలయ్యాయి. సామదానభేద దండోపాయాలతో
రోజు రోజుకూ బలహీనపడుతున్న పార్టీలు అస్తి
త్వాన్ని కాపాడుకోవడానికే ఆపసోపాలు పడే
పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీకి
లొంగిపోవటమో.. రాజకీయం చేయడం
మానుకోవడమో అన్న దుస్థితి నెలకొన్న దశ.
మోదీ, అమిత్ షా కుటిలనీతికి కాంగ్రెస్ కకావికలమైంది.
శరద్పవార్, మమతా బెనర్జీ, కేజరీవాల్, స్టాలిన్ వంటి నేతలు
చతికిలబడిన పరిస్థితి. ఈ క్రమంలోనే తెలంగాణపై తెగబడ్డ
బీజేపీ ముఠాను ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టుకొని.. ఆ పార్టీ నాయకత్వానికి ముచ్చెమటలు పట్టించిన నేత కేసీఆర్. ఇవాళ దేశ రాజకీయ
రంగానికి ఒక దిక్సూచిగా కేసీఆర్ మాత్రమే కనిపిస్తున్నారని
విశ్లేషకులు అంటున్నారు.

ఆత్మరక్షణలో బీజేపీ ఎనిమిదేండ్లుగా విచ్చలవిడిగా
వ్యవహరిస్తూ వచ్చిన బీజేపీకి..తెలంగాణలో కేసీఆర్ విసిరిన
బ్రహ్మాస్త్రంతో ఊహించని దెబ్బ తగిలింది. మోదీ షా ద్వయం
ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. కేసీఆర్ వంటి
నేతతో పెట్టుకోవడం అంటే ఆషామాషీ కాదని తెలిసివచ్చింది.
మునుగోడు అనే కల్పిత ఉపఎన్నికను తెచ్చి.. కేసీఆర్ను
తెలంగాణ రాష్ట్రానికే కట్టడి చేయాలని పన్నిన కుట్ర భగ్నం
కావటమే కాకుండా.. తెలంగాణ ఎమ్మెల్యేలను కొనడానికి వేసిన ఎరకు వాళ్లనే చిక్కుకొనేలా చేసి బజారున నిలబెట్టారు.
రాష్ట్ర దర్యాప్తు సంస్థలను, సీఆర్పీసీని సమర్ధంగా వినియోగించి.. తమకు వెన్నెముకలా వ్యవహరిస్తూ.. వారి కుతంత్రాలను అమలుచేస్తున్న వ్యక్తికే ఉచ్చు బిగించడంతో మోదీ,షాలకు ఊపిరాడటంలేదని ఆ పార్టీ వర్గాలే
అంతర్గతంగా అనుకొంటున్నాయి. దేశంలో
తమను ప్రశ్నించే గొంతుక ఉండకూడదు..
ప్రతిపక్షాలు మనుగడ సాగించకూడదు. ప్రజాదరణతో ప్రత్యర్థి పార్టీలు ప్రభుత్వాలు నడుపకూడదు.. ఇలా నిలువెత్తు అహంకారాన్ని నింపుకొన్న వ్యక్తిత్వాలు.. ప్రజాస్వామ్యం
పైనా, సమాఖ్య స్ఫూర్తిపైనా కనీస గౌరవంలేని కుటిల మనస్కులను నిగ్గదీసి నిలదీసే నాయకుడు వచ్చారని రాజ్యాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు
జరుగుతాయని తెలిసి కూడా.. తనను, తన పార్టీ నేతలను అష్టకష్టాలు పెడుతారని తెలిసి కూడా మడమతిప్పకుండా.. బీజేపీ కూటనీ తిని ఎండగట్టిన రాజకీయ నేత కేసీఆర్ అని

అంటున్నారు. ఇన్ని దాడులు జరుగుతున్నా
కూడా టీఆర్ఎస్ లోని ఒక్క నాయకుడు
కూడా కేసీఆర్ చేయి వీడకుండా.. కేసీఆర్
అడుగులో అడుగు వేస్తూ కదలటం చూసి
ఆశ్చర్యపోతున్నారు. పార్టీ పట్ల, పార్టీ నాయకుడి పట్ల సహచరులకు ఉన్న అచంచల విశ్వాసాన్ని చూసి.. నాయకుడంటే కేసీఆర్.. పార్టీ అంటే టీఆర్ఎస్ అనే పరిస్థితి నెలకొన్నదని వ్యాఖ్యానిస్తున్నారు.
మోదీ షాలకు చెక్ తమ పన్నాగాలకు తొలిసారిగా తెలంగాణ సర్కార్ చెక్ పెట్టడంతో మోదీ, అమిత్షా తేలు కుట్టిన దొంగల్లా నోరు విప్పకుండా మౌనం పాటించాలనుకొన్నప్పటికీ.. సాధ్యకాలేదు. ఎక్కడో రామగుండంలో ఏడాదిక్రితం పనులు మొదలుపెట్టిన ఒక కంపెనీకి కల్పిత ప్రారంభోత్సవాన్ని పెట్టుకొని.. అక్క
డికి పోవడానికి ముందే.. హైదరాబాద్కు
వచ్చి.. విమానాశ్రయానికే కార్యకర్తలను పిలిపించుకొని.. నర్మగర్భంగా ఆక్రోశాన్ని వెళ్లగక్కి వెళ్లిపోయారు. 56 అంగుళాల ఛాతీ కలిగిన ప్రధాని మోదీ, ఆయన ముఠాను ప్రజాక్షేత్రంలో కేసీఆర్ నిలబెట్టడం జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. కేంద్రానికే కాదు..
రాష్ట్రానికీ అధికారాలున్నాయి
సమాఖ్య స్ఫూర్తి పాలనలో కేంద్రానికి
అపరిమితమైన అధికారాలేమీ రాజ్యాంగం
కట్టబెట్టలేదు. చట్టాల ముందు కేంద్రం,
రాష్ట్రం రెండింటికీ అధికారాలను కల్పించింది.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని దర్యాప్తు సంస్థలకు ఎన్ని అధికారాలు ఉన్నాయో, అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పనిచేసే దర్యాప్తు సంస్థలకూ విస్తృతమైన అధికా
రాలను కల్పించింది. రాష్ట్రాలకు సీఆర్పీసీ
చట్టం ప్రకారం అంతేస్థాయిలో అధికారాలు
న్నాయని మోర విరుచుకొని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులకు నోటీసులు జారీచేసి ఇంతవరకూ ఏ రాష్ట్రమూ చేయని పనిని చేసింది. ఎమ్మెల్యే
లకు ఎర కేసులో లభ్యమైన ఆడియో,వీడియో, కాల్ డాటా సాక్ష్యాలన్నింటినీ తెలం గాణ ప్రభుత్వం సేకరించింది.
చట్టంచట్రంలో నిందితులు బుకాయించడానికి
ఆస్కారం లేనివిధంగా ప్రజల ముందు దోషు
లుగా నిలబెట్టడంలో తెలంగాణ ప్రభుత్వం
కృతకృత్యమైంది. ఈ ఉదంతంలో తెలంగాణ
ప్రభుత్వం దేశానికే మార్గదర్శకం అయింది.
బీఆర్ఎస్.. గుణాత్మక ప్రస్థానం
జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు సాధించడం
కోసం భారత్ రాష్ట్ర సమితి పేరుతో కేసీఆర్
ప్రారంభించిన జాతీయ రాజకీయ ప్రస్థానం
తెలంగాణ వేదికగానే సంచలన అడుగులు
వేస్తున్నది. కేంద్రంలో తనకు అడ్డే లేదని
అధికారాన్ని చెలాయిస్తున్న పార్టీకి
చుక్కలు చూపించి బీఆర్ఎస్ రాజకీయ
పంథా ఏమిటో కేసీఆర్ చేతల ద్వారానే
చెప్పారు. రాజకీయాల్లో గుణాత్మక
మార్పు ఏ విధంగా ఉండాలో..
ఉండబోతుందో శాంపిల్

నేడు దీక్షా దివస్
తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక
మలుపు తిప్పిన కేసీఆర్ దీక్షకు నేటితో 13
ఏండ్లు. ఉద్యమ నాయకుడిగా ఆయన 'తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో' నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ
దీక్షకు దిగారు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రజ్వలింపజేసి, తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేసిన రోజును టీఆర్
ఎస్ దీక్షా దివస్ గా పాటిస్తున్నది. 2009
నవంబర్ 29న కరీంనగర్ లోని ఉత్తర
తెలంగాణభవన్ నుంచి దీక్షాస్థలి సిద్దిపేటకు
కేసీఆర్ బయలుదేరగా, కరీంనగర్ మానేరు
బ్రిడ్జి అలుగునూరు వద్ద పోలీసులు అరెస్టు
చేశారు. అక్కడి నుంచి ఖమ్మం జైలుకు తరలించారు. ఆ తరువాత నిమ్స్ దవాఖానకు తరలించారు. అక్కడే కేసీఆర్ దీక్షను 11రోజుల పాటు కొనసాగించారు. తెలంగాణ
రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని డిసెంబర్ 9
యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన తరువాతనే ఆయన దీక్షను విరమించారు.

ఒకే ఒక్కడు..
ప్రజాస్వామ్య పరిరక్షణకు కదిలిన దీక్షాదక్షుడు
జాతీయ రాజకీయాలకు మార్గదర్శకుడు
ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి వెలుగు దివిటీ
ఎనిమిదేండ్ల క్రితం అధికారంలోకి
వచ్చిన్నాటి నుంచి.. తమకు ఎదురేలేదని
విర్రవీగుతూ వచ్చిన పార్టీ దూకుడును
ఒకే ఒక్కడు దీటుగా నిలువరించాడు.

ఎనిమిదేండ్ల క్రితం అధికారంలోకి
వచ్చిన్నాటి నుంచి.. తమకు ఎదురేలేదని
విర్రవీగుతూ వచ్చిన పార్టీ దూకుడును
ఒకే ఒక్కడు దీటుగా నిలువరించాడు.
దర్యాప్తు సంస్థలు కేంద్రానికే కాదు..
రాష్ట్రాలకు కూడా ఉంటాయని.. సమర్థంగానూ, బలంగానూ ప్రయోగించగలవని ఒకే ఒక్కడు రుజువు చేశాడు.
సమాఖ్య స్ఫూర్తిని భగ్నం చేసి.. వ్యవస్థల
హననానికి పూసుకొన్న శక్తులకు ముకుతాడు
వేసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం
ఒకే ఒక్కడు అడ్డుగోడై నిలుచున్నాడు.
మోదీ, షాలను ఎదుర్కోవడం సాధ్యమే కాదని
నిస్పృహల్లో ఉండిపోయిన రాజకీయ
పార్టీలకు.. వాళ్లు అజేయులేం కారని
ఒకే ఒక్కడు కొండంత నమ్మకాన్నిచ్చాడు.
తాడిని తన్నేవాడుంటే.. వాడి తలదన్నేవాడు
ఉన్నాడని నిరూపించి.. ఎమ్మెల్యేల ఎర కుట్రను విచ్ఛిన్నం చేసి..
ఒకే ఒక్కడు బీజేపీని ఊహించని
రీతిలో ఆత్మరక్షణలో పడేశాడు.మోదీ, షాల నిర్వాకంతో నీరసించిపోయిన రాజకీయ గుండెలకు ఆయువు పోశాడు.
దర్యాప్తు సంస్థల దుర్వినియోగం.. మతాల మధ్య ఉద్రేకాలు రెచ్చగొట్టడం.. తడిగుడ్డల ప్రమాణాలతో విశృంఖల విహారం చేస్తున్న బీజేపీ నిజస్వరూపాన్ని నగ్నంగా బయట
పెట్టి.. దాన్నెలా అడ్డుకోవచ్చో చూపించాడు.

బీజేపీ అహాన్ని దెబ్బతీసిన ఏకైక నాయకుడు
మోదీ, షా అజేయులేం కాదని రుజువు చేసిన నేత
బీజేపీ నిజస్వరూపాన్ని బజారున పెట్టిన నాయకుడు
రాష్ట్ర దర్యాప్తు సంస్థల ఉచ్చులో పడిన బీజేపీ బ్రోకర్లు
ఆత్మరక్షణలో ఎటూ పాలుపోని బీజేపీ అగ్రనాయకత్వం
రాజనీతిని, రాజకీయ పంథాను రుచి చూపించిన నేత
సీఎం కేసీఆర్ రాజనీతికి ప్రాంతీయ పార్టీలు విస్మయం
Politics is nothing but perception
అన్నారు రాజకీయ పండితులు.
అభిప్రాయాన్ని కలిగించడమే రాజకీయం. ఫలానా పార్టీ
మంచిదని అంటే.. మంచిగానే చెలామణి అవుతుంది. చెడు
అంటే చెడుగానే చలామణి అవుతుంది. బీజేపీ పైన ఉన్న

పర్సెప్షన్ను మార్చి.. బీజేపీ బండారాన్ని బట్టబయలు చేశాడు.
అతడు 'నేనురా తెలగాణ నిగళాలు తెగద్రొబ్బి ఆకాశమంత ఎత్తార్చినాను' అని నినదించిన వీరుడు.. తెలంగాణను సాకారం చేసిననాయకుడు.. కే చంద్రశేఖర్రావు. ఇప్పుడు మహాకవి దాశరథి అన్నట్టు భూవదనంబునందు కుంకుమము భగ్గున మండినది అగ్గివోలె అంటూ కేసీఆర్  కదులుకున్నాడు.. కోట్లాది ప్రజల గళ ధ్వనియై.. ఇలాగోళమందున్న అందరి శబ్దమై.. తానొక్కడే ప్రజాకోటియై.. ఢిల్లీ వైపు...ఇది భారత్ రాష్ట్ర సమితి రాజకీయ ప్రస్థానానికిమచ్చు తునక.. బీఆర్ఎస్ రాజనీతికి మెచ్చు తునక.